మొక్కలు నాటిన అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి

1334
allipuram venkateshwar reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకొని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చేయించడం జరుగుతుంది.

ఇందులో భాగంగా దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శ్రీ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం లోని తన స్వగ్రామం అల్లీపురం గ్రామం లోని గార్ల గట్టు పై మొక్కలు నాటి విత్తన బంతులను విసిరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, చిన్న చింతకుంట మండల ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -