వృద్దాప్య పెన్షన్ల దరఖాస్తుకు మరోసారి అవకాశం

85
dayakarrao
- Advertisement -

సీఎం కెసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. క్రొత్తగా దరఖాస్తులు చేసుకొనే వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 31 నాటికి క్రొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినప్పటికి, అర్హులైన అందరికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఈ నెల 11 నుండి 30 లోగా దరఖాస్తుకు మరో అవకాశం కల్పించింది. ఈ సేవ లేదా మీ సేవ ల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఆయా దరఖాస్తులను స్వీకరించాలని, తక్షణమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్లకు, ghmc కమీషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కెసిఆర్ ఆదేశాల ప్రకారం 57 ఏండ్లు, ఆపై వయస్సు కలిగిన వాళ్లంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపిచ్చారు.

ఆసరా పెన్షన్ల లో భాగంగా కనీస వయస్సు 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితి మేరకు లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. అర్హులైన వారు ఈ నెల 11 నుండి 30 లోగా ఈసేవ, మీ సేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ghmc కమిషనర్ ఈ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. అక్టోబర్ 30 లోగా దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. జీఓ 75 ప్రకారం పుట్టిన తేదీ ధృవీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తు తో పాటు జత చేయాలన్నారు. కాగా ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

అందరికీ న్యాయం చేయాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమని, అందుకనుగుణంగానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అందులో ఆసరా పెన్షన్లు ఉన్నాయని, దేశంలో ఎక్కడలేని విధంగా పెన్షన్లు, పెన్షన్ల మొత్తం వృద్దులకు రూ. 2016/-, దివ్యాంగులకు రూ. 3016/- అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

- Advertisement -