- Advertisement -
ఆందోళన వద్దు….ధైర్యంతో సమిష్టిగా కరోనాను ఎదుర్కొందామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. పాలకుర్తి నియోజిక వర్గంలోని కరోనా బాదితులు, వారి కుటుంబాలు, ప్రజా ప్రతినిధులు, అదికారులతో టెలీ కన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన డిఎం & హెచ్ఓలు, డిపిఓలు, ఎంపిపి లు, జెడ్పిటిసి లు, ఎంపిటిసి లు, సర్పంచులు, ఎంపిడిఓ లు, పోలీసు అధికారులు డాక్టర్లు తహశీల్దార్లు గ్రామ స్తాయి అదికారులు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
- Advertisement -