బీజేపీ రాజకీయాలు చేస్తే అడ్రస్ లేకుండా పోతారు..

237
errabelli
- Advertisement -

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, అవార్డులు పొందిన మరికొందరు సర్పంచులతో ప్రధాని మోడీ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టరేట్ నుండి తెలంగాణ రాష్ట్ర పంచాతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ రఘునందన్ రావ్, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని, ఉత్తమ గ్రామ పంచాయతీలకు గ్రామ స్వరాజ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అవార్డులు ఇవ్వనున్నారు.అలాగే పలు రాష్ట్రాల మంత్రులు, సర్పంచుల తో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా లాక్ డౌన్‌ను పాటిస్తున్న విధానాలను ప్రధాని సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాము.12 లక్షల మంది ఉపాధి హామీ పనులు చేస్తున్నారు.ఐకెపి సెంటర్ల ద్వారా మాస్క్ లు ఇస్తున్నాం.సామాజిక దూరం పాటించి పనులు చేస్తున్నాము. పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చెరువులను అభివృద్ధి చేసుకోవడంతో ఉపాధి హామీ కార్మికులకు పని దొరకడం లేదు. అందుకని వ్యవసాయంకు అనుసంధానం చేయాలని కోరాం దీనితో రైతులు సగం ప్రభుత్వం సగం చెల్లిస్తుందన్నారు.

ఉపాది హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని పీఎంను అడిగాము. దీని వల్ల రైతులకు, కూలీలకు మేలు జరుగుతుంది. కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నాము.అలాగే గన్ని బ్యాగ్ ల కొరత ఉంది అయిన అధిగమించాం.తెలంగాణ రాష్ట్రంలో గోదాముల నిర్మాణం సీఎం కేసీఆర్ చేపట్టారు దానితో చాలా ఇబ్బందులు తప్పాయి. ఇక బీజేపీని ఎవరు ఇక్కడ గుర్తించడం లేదు. మూడు సంవత్సరాలుగా ఉపాధి హామీ పనులను రైతులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగారు.కానీ ఇప్పటి వరకు చేయలేదు దానిపై చెయ్యండి ధర్నా కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు.

రైతులకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ మోడీకి చెప్పారు కానీ చేయలేదు అది చాలా మంచి పథకం. కేంద్రం నిధులు చాలా పెండింగ్ లో ఉన్నాయ్.అవ్వి ఇప్పించు దమ్ముంటే. కేంద్రం రాష్టాలను ఇబ్బంది పెడుతున్నారు. అయిన ఇది సమయం కాదు కాబట్టి ఉరుకుంటున్నాం. బీజేపీ రాష్ట్రంలో వరి ధాన్యం,మొక్కజొన్నలు కొంటున్నారా,రాష్ట్ర బీజేపీ నాయకులు చూపించాలి. రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఒకరిద్దరు ఏదో చేస్తే దానిపై రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తే అడ్రస్ లేకుండా పోతారు.

కేసీఆర్ అన్ని త్యాగాలు చేసి రైతులను ఆదుకుంటున్నారు.కేసీఆర్ వంద శాతం సక్సెస్ అయ్యారు.బీజేపీ చేస్తున్న పనులను ఎవరూ హర్షిస్తలేరు. కేంద్రం నుంచి రాష్టాలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి.రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేయాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ పని చేస్తున్నారు. అందరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

- Advertisement -