అసెంబ్లీ ఉద్యోగులకు బత్తాయిలు అందజేసిన గుత్తా సుఖేందర్

228
- Advertisement -

కరోన మహమ్మరిని నిర్ములించడానికి సి విటమిన్ ఎక్కువగా ఉన్న బత్తాయి, నిమ్మ పండ్లను ఎక్కువగా తినాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో తానే స్వయంగా బత్తాయి పండ్లను అసెంబ్లీ ఉద్యోగులు, మీడియా మిత్రులకు శాసన మండలి చైర్మన్ అందజేశారు. బత్తాయి పండ్లను ప్యాకింగ్ చేసి హైదరాబాద్ పంపడానికి వర్కర్లు ఎవరు కరోన కారణంగా అందుబాటులో లేకపోవడంతో శాసన మండలి చైర్మన్ స్వయంగా ప్యాకింగ్ చేసి ఈ రోజు ఉదయం పోలీస్ పర్మిషన్ ఉన్న వెహికల్ లో అసెంబ్లీకి పంపించారు. తన చేతుల మీదుగా పంపిణీ చేయాలి అనుకున్న నల్గొండలో బిజీగా ఉండటం వలన అసెంబ్లీ సెక్రటరీ నర్సింహ చార్యులు సహకారం తీసుకొని సెక్రటరీ, టిఆర్‌ఎస్ ఎల్పీ రమేష్ రెడ్డి చేతుల మీదుగా అసెంబ్లీ స్టాఫ్ మరియు మీడియా మిత్రులకు బత్తాయి పండ్లు పంపిణీ చేయించారు.

Assembly Employees

కరోన నివారణ కొరకు ప్రజలు సంపూర్ణంగా లాక్ డౌన్ ని పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలి అన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడం కొరకు సి విటమిన్ ఎక్కువగా ఉండే బత్తాయి, నిమ్మ పండ్లను తినాలి అని శాసన మండలి చైర్మన్ సూచించారు. పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ తమ స్టాఫ్ మరియు మీడియా ప్రతినిధుల ఆరోగ్యం కొరకు బత్తాయి పండ్లను పంపిణీ చేసారని అన్నారు. శాసన మండలి చైర్మన్ తాను స్వయంగా బత్తాయిలను బ్యాగుల్లోకి ప్యాక్ చేసి హైదరాబాద్ కి పంపించారన్నారు. ప్రజలు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారని, త్వరలోనే తెలంగాణ కరోన రహిత రాష్ట్రం అవుతుంది అని నమ్మకం ఉందని అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహ చార్యులు చెప్పారు.

- Advertisement -