తెలంగాణపై కేంద్రం కక్ష- మంత్రి ఎర్రబెల్లి

28
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంపై కక్ష కట్టి వివక్షతతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఈ యాసంగిలో పండిన ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ వర్ధన్నపేట మున్సిపాలిటీ వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు సర్వ సభ్య సమావేశాలు నిర్వహించి, ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఆ తీర్మానం కాపీలను వర్ధన్నపేట నియోజకవర్గం మండలం నందనం గ్రామ పర్యటనకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆ ప్రతులను ఆయా ప్రజా ప్రతినిధులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంపై కక్ష కట్టి వివక్షతతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ సాధించుకున్న విధంగానే, కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ డిమాండ్‌ను సాధించి తీరుతామని మంత్రి తెలిపారు.

- Advertisement -