మీర్‌పేట డివిజన్‌లో మంత్రి ఎర్రబెల్లి ఇంటింటి ప్రచారం..

169
errabelli
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 4వ మీర్ పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ డివిజన్‌లో డైమండ్ కాలనీలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్‌తో కలిసి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి. ప్రజల పనులలో మమేకం అవుతూ…జీహెచ్‌ఎంసీ ఆ కాలనీలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి ఎదురేగి కాలనీల ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ ఐదేండ్లలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. ఈ డివిజన్‌లో వున్న సమస్యలను నిన్న కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళాను ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సీఎం కేసిఆర్,మంత్రి కేటీఆర్,నేను మేమంతా మాట అంటే మాట మీద నిలబడేవాళ్ళం. మీ సమస్యలు అన్ని తెలుసు ఎన్నికల తరువాత ఆ సమస్యలను తీర్చే బాధ్యత నాది ఈని మంత్రి అన్నారు.

ఈ డివిజన్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి జెర్రిపోతుల ప్రభుదాస్‌ను గెలిపించండి. నేను ఈ డివిజన్‌ను దత్తత తీసుకొని కడిగిన ముత్యం లా చేస్తా…అతి త్వరలో ఉప్పల్ నియోజకవర్గానికి 5 ఐటీ పార్కులకు శంకుస్థాపన చేయబోతున్నాం. ఈ ఐటీ పార్కుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు.

- Advertisement -