కార్యకర్తలను కంటికి రెప్పలా కపడుకుంటాను- మంత్రి ఎర్రబెల్లి

242
minister errabelli
- Advertisement -

కార్య‌క‌ర్త‌లే పార్టీకి ప్రాణ‌మ‌ని, ఆ కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాన‌ని రాష్ట్ర పంచాయ‌తీరా్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో మంత్రి సంబంధిత బాధితుల‌కు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కిచ్చే ప్ర‌మాద బీమా చెక్కుల‌ను ఒక్కొక్క‌రికి రూ.2 ల‌క్ష‌ల చొప్పున అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీల మ‌నుగ‌డ పార్టీ కార్య‌క‌ర్త‌ల మీద ఆధార పడి ఉంటుంద‌ని, ఈ విష‌యం తెలిసిన సీఎం కెసిఆర్, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మిగ‌తా ఏ పార్టీల‌కు లేని విధంగా భీమా స‌దుపాయం క‌ల్పించార‌న్నారు. వారి ప్రీమియంను కూడా పార్టీ చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశార‌న్నారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి పాల‌కుర్తికి చెందిన‌‌ గుంజే రాజు భార్య గుంజే సుజాతకు,దేవరుప్పుల మండలంలోని చిన్న మడురు గ్రామానికి చెందిన మొగుళ్ల సోమనర్సయ్య భార్య విజయమ్మ కు రూ.2ల‌క్ష‌ల చొప్పున చెక్కులు అంద‌చేశారు. చెక్కులు పొందిన సుజాత, విజయమ్మలు సీఎం కెసిఆర్‌కు, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి కృత‌జ్ఞ‌త‌లు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి దేవరుప్పుల మండల టిఆర్ఎస్ పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

- Advertisement -