స్వరాష్ట్రంలో గ్రామాలకు మహర్దశ: మంత్రి ఎర్రబెల్లి

122
errabelli
- Advertisement -

స్వరాష్ట్రంలో గ్రామాలకు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల‌పై అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు మంత్రి ఎర్ర‌బెల్లి .

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి……గ్రామాల అభివృద్ధే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని వెల్లడించారు. త్వ‌ర‌గా వైకుంఠ‌ధామాలు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. గ్రామాల‌ను అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేయాల‌న్నారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృత నిశ్చ‌యంతో ఉన్నార‌ని తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రుల స‌మావేశంలో మ‌న శాఖ‌ల ప‌నితీరును సీఎం అభినందించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ స‌మావేశానికి ఆయా శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తనియా, పంచాయితీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఈఎన్సీ పీఆర్ సంజీవ రావు హాజ‌ర‌య్యారు.

- Advertisement -