కాంగ్రెస్,బీజేపీలకు సాగర్ ప్రజలు బుద్ధి చెప్పారు..

181
ik reddy
- Advertisement -

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు కొనసాగుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రజలు టీఆర్ఎస్ వెన్నంటి నిలిచి ఎమ్మేల్యేగా నోముల భగత్‌కు పట్టం కట్టారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు, కేటీఆర్‌కు, ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల భగత్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విజయాన్ని అందించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు.కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ఈ విజయంతో మరోసారి స్పష్టమైందని తెలిపారు.

తెలంగాణలో బీజేపీకి చోటు లేదని, టీఆర్ఎస్‌కు బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసారు. రెండు జాతీయ పార్టీలకూ నాగార్జున సాగర్ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. గత ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ఉనికే లేదన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

- Advertisement -