పూర్తి స్థాయిలో అందుబాటులోకి మెట్రో సర్వీసులు..

122
metro
- Advertisement -

సోమవారం నుండి మెట్రో సర్వీసులు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి. నేటి నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయగా ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్‌, చివరి స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది.

ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం నిబంధనలు పాటించాలని మెట్రో అధికారులు కోరారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నాలలో భద్రతా సిబ్బంది, హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని అభ్యర్థించారు.

- Advertisement -