నేటి నుండి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం కేసీఆర్. ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్న సీఎం…సోమవారం వరంగల్లో పర్యటించనున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో నిర్మించిన కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభిస్తారు. సిద్ధిపేటలో పోలీస్ కమిషనరేట్, కామారెడ్డిలో డీపీఓ కార్యాలయ భవనాలను ప్రారంభించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు సైతం చేసే అవకాశముంది.
సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, పోలీస్ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్ధిపేటలో నాలుగెకరాల విస్తీర్ణంలో 62 కోట్ల 60 లక్షలతో ఈ నూతన భవన సముదాయాన్ని నిర్మించారు. రెండంతస్తుల భవనంలో 600 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వసతులు కల్పించారు.. 40 శాఖలకు 100 గదులను కేటాయించారు.
సోమవారం వరంగల్లో పర్యటించనున్నారు. కూల్చివేసిన సెంట్రల్ జైలు స్థానంలో.. కొత్తగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు శంకుస్థాపన చేయనున్నారు.