తెలుగు చిత్ర పరిశ్రమలో మెహరీన్ హావా మామూలుగా లేదుగా.. టాలీవుడ్లో ఈ అమ్మడుకు కాలం బాగానే కలిసొస్తున్నట్టే కనబడుతోంది. వరుస అవకాశాలతో మాంచి ఊపుమీద ఉన్నది ఈ ముద్దుగుమ్మ. టీ టౌన్లో మొదటగా నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మెహరీన్ ఈ మద్య మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ద్విబాషా చిత్రం నోటాలను హీరోయిన్గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ బ్యూటీ వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రం ఎఫ్2లో అలరించబోతోంది. పులివాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ మెహరీన్ నటిస్తోంది. సుధీర్ బాబు హీరోగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బేన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలోనూ మెహరీన్ నటించబోతోంది. అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న 5వ చిత్రంలోనూ మెహరీన్ కథానాయికగా ఎంపికైంది. ఈ మూవీలో మరోనాయికగా కాజల్ ఎంపిక చేశారు చిత్రం బృందం. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమలో చాపకింద నీరులా మెహరీన్ వరుస అవకాశాలతో మంచి జోరును కనబరుస్తుందనే చెప్పాలి. మెహరీన్ కు మంచి అవకాశాలతో పాటు మంచి హిట్లు కూడా రావాలని, ఆమె కెరియర్ దేదిప్యమానంగా వెలుగొందాలని మనమూ కోరుకుందాం.