వెబ్‌ సిరీస్‌లో మెహ్రీన్…!

662
mehreen
- Advertisement -

మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హిందీ భామ మెహ్రీన్ . కృష్ణగాడి వీర ప్రేమ గాథతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌,కోలీవుడ్‌,మలయాళ,పంజాబీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ప్రస్తుతం మెహ్రీన్ నటించిన చాణక్య అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

కథ బాగుండి …పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఏ తరహా పాత్రలు చేయడానికైనా సిద్ధమేనని తెలిపింది మెహ్రీన్ . తనను ఇంత వరకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లోనే చూశారు కాబట్టి అలాంటివే చేస్తానేమో అనుకుంటున్నారు అందుకే కాస్త భిన్నంగా ఉండే పాత్రలు చేయాలని ఉందని తెలిపారు. ప్రస్తుతం తెలుగులో కల్యాణ్ రామ్‌తో ఎంత మంచివాడవురా, నాగశౌర్యతో అశ్వద్ధామ చేస్తున్నా తమిళ్‌లో ధనుస్‌తో పటాస్ చేస్తున్నా…పంజాబీలో తాను నటించిన రెండో చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుందని తెలిపింది. అవకాశం వస్తే తప్పకుండా వెబ్ సిరీస్‌లో నటిస్తా… ప్రస్తుతం మా తమ్ముడు ధర్మ ప్రొడక్షన్స్‌లో కియారా అద్వాణీతో ఓ సిరీస్ చేస్తున్నాడని తెలిపింది.

తాను నిజాయితీగా పనిచేసుకుంటూ పోతా… పనిలో ఆనందాన్ని వెతుక్కుంటానని తెలిపింది. ప్రతిసారి నా మనసుకు నచ్చిన పాత్రలే చేస్తుంటానని తెలిపింది. జీవితం అంటేనే ఒడిదొడుకులు రోజు కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుందన్నారు. గెలుపైనా ఓటమైనా వాటిని గౌరవిస్తూ ముందుకు సాగడం ముఖ్యం అన్నారు.

పంతం తర్వాత గోపిచంద్‌తో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. ఆయనతో పనిచేయడం చాలా హాయిగా ఉంటుందని తెలిపింది మెహ్రీన్. ఇంతవరకు తాను చేయని పాత్ర చాణక్య సినిమాలో చేస్తున్నానని తెలిపింది.

- Advertisement -