మొక్కలు నాటిన బిగ్ బాస్ ఫేం మెహబూబ్…

197
mehaboob
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోహెల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికోండ లోని తన నివాసంలో మొక్కలు నాటారు బిగ్ బాస్ 4 ఫేం మెహబూబ్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని దాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తన మిత్రులు యాంకర్ లాస్య మంజులత, మోనల్, జబర్దస్త్ అవినాష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -