‘బ్రహ్మాస్త్ర’లో భాగమైన మెగాస్టార్‌..

66
chiru
- Advertisement -

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్,కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తెలుగులో ‘శివ’ పేరుతో ఫస్ట్ పార్ట్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ జూన్ 15న లాంచ్ చేయనున్నారు.

ఈమూవీ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా భాగమయ్యారు. ఈ సినిమా కోసం చిరు తన వాయిస్ అందించారు. ఈ మేరకు ‘బ్రహ్మాస్త్ర’ యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో చిరంజీవి సరికొత్త హెయిర్ స్టయిల్‌తో దర్శనమివ్వడం విశేషం. ఇక చిరు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

- Advertisement -