ఎంపీ సంతోష్‌కి అభినందనలు: చిరంజీవి

220
chiru
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతుంది. దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి నాయకత్వంలో ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రారంభించారు ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు దూసుకుపోతున్న మా హీరో రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు కరోనా వైరస్ వల్ల మానవ శరీరం లో మొదటగా దెబ్బ తినేది ఊపిరితిత్తులు గాలి పీల్చుకో లేక మనిషి చనిపోతున్నారని ప్రాణవాయువు ఊపిరితిత్తులకు అంత ప్రాధాన్యం ఉండదని ఈ కరోనా సమయం లో సామాన్యులకు కూడా ప్రాణవాయువు విషయం తెలియ వచ్చిందని ఈ భూమి తల్లి గూడా అడవులు వృక్షాలు ప్రాణవాయువు అందిస్తాయని భూమికి ఊపిరితిత్తులు చెట్లు అని అలాంటిలాంటి ప్రాణవాయువును అందించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి అభినందనలు తెలిపారు.

మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు అందించే గొప్ప సంపద అని మొక్కలు మనం ఇచ్చే కాలుష్యాన్ని పిలుచుకొని మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయని దానిని గుర్తించిన సంతోష్ గారు గత మూడు సంవత్సరాల నుండి ఆయన చేస్తున్న కార్యక్రమం లో గతంలో కూడా ఒక సారి పాల్గొనడం జరిగింది అని. ఇప్పుడు కూడా పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని జూబ్లీ హిల్స్ సొసైటీ ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని వారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మెగా అభిమానులందరూ కూడా మొక్కలు నాటాలని అదే మనం ఈ భూమికి తిరిగి ఇచ్చే ప్రతి ఉపకారం అని తెలిపారు.

- Advertisement -