ప్రతి ఆదివారం- ప్రతి నిమిషాలు కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి..

220
errabelli
- Advertisement -

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ నివాసంలో పారిశుద్ధ్య ప‌నులు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రతి ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మొక్కలకు నీళ్లు పట్టిన ఎర్రబెల్లి… చెత్తా చెదారం తీసేసి దోమ‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ విస్తృతి తో ప్రపంచం అతలాకుతలం అవుతున్నదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. స్వీయ నియంత్రణని పాటించాలన్నారు.

ఈ సీజన్ లో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని……ఇంటితోపాటు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా రాష్ట్రాన్ని,దేశాన్ని రోగ ర‌హితంగా మార్చొచ్చని మంత్రి తెలిపారు. అవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు వెళ్లొద్దు…. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రతి ఒక్క రూ పాటుపడాలన్నారు ఎర్రబెల్లి.

- Advertisement -