నాగబాబు ప్లాస్మా దానం.. చిరు కామెంట్స్‌..

241
chiru
- Advertisement -

మెగా బ్రదర్‌ నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా బాధితులను కాపాడాలనే మంచి లక్ష్యంతో ఆయన ప్లాస్మాను దానం చేశారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. నాగబాబుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

‘కరోనాపై పోరాడి గెలవడమే కాకుండా… మరికొందరిని కాపాడే క్రమంలో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -