‘మహానటి’టీంకు అల్లు ఫ్యామిలీ పార్టీ..

250
Mega Producer Lavish Party To Mahanati team
- Advertisement -

అలనాటి నటీ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఇటీవల విడుదలైన ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ మూవీపై సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా యూనిట్‌ను అభినందించారు.

 Mega Producer Lavish Party To Mahanati team

ఏకంగా తన ఇంటికి పిలిపించుకుని దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినిదత్, స్వప్నదత్‌, ప్రియాంక దత్‌లను ఘనంగా సత్కరించాడు. తాజాగా అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లు కూడా నిన్న (ఆదివారం) ఈ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలతో స్పెషల్‌గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో సినీ ప్రముఖులైన దర్శకధీరుడు రాజమౌళీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిలు పాల్గొన్నారు.

సావిత్రి పాత్రలో నటించిన కీర్తీ సురేష్ తన నటనతో సావిత్రిని మరోసారి గుర్తుకు తెచ్చింది. ఇందులో కీర్తీ సురేష్‌తో పాటు సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, క్రిష్, అవసరాల శ్రీనివాస్‌, నాగ చైతన్యలు సీనియర్ నటీనటుల పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినిదత్, ప్రియాంక దత్, స్వప్నదత్‌లు నిర్మించారు. మెక్కి జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

- Advertisement -