లండన్‌కు మెగా ఫ్యామిలీ

12
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌కు అరుదైన గౌరవం లభించగా ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని మే9 ఆవిష్కరించనున్నారు.

ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్​ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీన్​ కారా, పెంపుడు శునకం రైమ్​ లండన్​కు బయలుదేరినట్లు సమాచారం.

టుస్సాడ్స్‌ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చరణ్‌ అన్నారు. చిన్నప్పుడు మేడమ్​ టూస్సాడ్స్​ మ్యూజియం చూసినప్పుడు లెజెండ్స్​ విగ్రహాలతో ఫొటోలు తీసుకునేవాడినని తెలిపారు. అయితే ఇలా ఒకరోజు అదే మ్యూజియంలో తన విగ్రహం ఏర్పాట్లు చేయడం, తన కెరీర్​ తొలి నాళ్లలోనే ఇలా జరగడం ఎన్నడూ ఊహించలేదన్నారు.

Also Read:ఉగ్రదాడి..దేశవ్యాప్తంగా సివిల్ మాక్‌డ్రిల్

- Advertisement -