మేడారం జాతరకు కేటీఆర్‌కు ఆహ్వానం..

513
ktr
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క – సారాలమ్మ జాతరకు రావాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర -2020 ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.టి.ఆర్ కి అందించారు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇతర తెలంగాణ నేతలు.

minister ktr

ఆహ్వాన పత్రికను అందించిన తర్వాత మేడారం చరిత్ర, విశిష్టత తెలిపే విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించిన తీరును మంత్రి సత్యవతి రాథోడ్, కార్యనిర్వాహక అధ్యక్షులు కె.టి.ఆర్ కు వివరించారు. సమ్మక్క – సారాలమ్మ జాతరలో జరుగుతున్న పనుల గురించి వివరించిన మంత్రులు.. అక్కడి పనులపై జరిపిన సమీక్షల వివరాలు తెలిపారు.

- Advertisement -