ఈ నెల 18వ తేదీన మేడారంలో కేబినెట్ సమావేశం జరగనుంది. 18వ తేదీన ఖమ్మం పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటల వరకు మేడారం చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి.
మేడారం చేరుకున్నాక పునర్నించిన గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, ములుగులోని హరిత హోటల్లో కేబినెట్ సమావేశంలో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి, మంత్రులు.
మరుసటి రోజు ఉదయం పునర్నిర్మించిన గద్దెల ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. దీంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి వర్గం, అధికారులు అంతా రెండు రోజులు మేడారంలో బస చేయాల్సి ఉండగా, 300 మందికి అధికారుల వసతి ఏర్పాట్లు చేశారు.
మంత్రులు, అధికారుల వసతి కోసం ములుగు, గోవిందరావుపేట, పస్రా, లక్నవరం, రామప్ప ప్రాంతాల్లోని వసతి గృహాలు, ప్రైవేటు హోటళ్లను ముందుగానే బుక్ చేశారు అధికారులు. రేవంత్ రెడ్డితో సహా మంత్రి వర్గం కూడా రెండు రోజులు మేడారంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయనుంది పోలీస్ శాఖ.
Also Read:ఈడీ సోదాలు..కోట్ల రూపాయలు స్వాధీనం

