బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ మాజీ ఎమ్మెల్యే

58
- Advertisement -

మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈరోజు పార్టీలో చేరారు. మెదక్ నియోజకవర్గ విజయంలో భాగ్యస్వామ్యం అయ్యేందుకు వచ్చిన శశిధర్ రెడ్డి కి, వారి వెంట వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలికారు మంత్రి హరీష్ రావు.

డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరని…. మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పని చేయవు.ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజలకు సేవ చేయాలన్నారు. మెదక్ పుకార్లు తిప్పికొట్టాలి. హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే పద్మ ఎంతో కృషి చేస్తున్నారు…ఇందిరాగాంధీ మాట తప్పారు. కానీ సీఎం కేసీఆర్ వల్ల, పద్మ వల్ల మెదక్ జిల్లా అయ్యింది. మెడికల్ కాలేజీ వచ్చింది. రైల్ వచ్చిందని చెప్పారు. ఘన్ పూర్ ఆనకట్ట నీళ్ళు వదలాలని ధర్నాలు చేసే రోజులు లేవు అని గుర్తుచేశారు.

రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నది కేసియర్. కరెంట్ నిరంతరం ఇస్తున్నారని చెప్పారు. పండుగల వేళ ఎన్నికల పండగ వచ్చింది. రకరకాల వ్యక్తులు వస్తున్నారని..దండగ అన్న వ్యవసాయం పండగ చేసింది కేసీఆర్ అన్నారు.పెట్టుబడి నాడు రూపాయి లేని పరిస్థితి. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తున్నాం అన్నారు. ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని…రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నా..3 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా, 24 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా ఆలోచించాలన్నారు.

ఎండాకాలంలో కూడా పంటకు నీళ్ళు అందుతున్నాయి. గుంట కూడా ఎండటం లేదని…కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో వెలుగు నింపుతున్నామని చెప్పారు. కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం అని..కిసాన్ సమ్మన్ నిధి, హర్ ఘర్ జల్, కళ్యాణ లక్ష్మి, మూగ జీవాలకు అంబులెన్స్…కేంద్రం మన పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తుందన్నారు. నాడు బెంగాల్ ఉండేది. నేడు తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరించే పరిస్థితి ఉందని పద్మ గెలుపు మెదక్ అభివృద్దికి మలుపు అన్నారు.

Also Read:చిరు 157కి ఆసక్తికర టైటిల్!

- Advertisement -