హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికైన సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఈనెల 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిబ్బంది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్ను సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా ఎన్నికైన మోతె శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు.
ఇటివలే ఈ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. విజయలక్ష్మి టీఆర్ఎస్ నుండి మేయర్గా గెలుపొందారు. మేయర్ పదవి కోసం బీజేపీ తరఫున ఆర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్రెడ్డి నామినేషన్ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి మేయర్గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ ఎన్నికలో ఎంఐఎం కూడా టీఆర్ఎస్ అభ్యర్థికే మద్దతు తెలిపింది. ఎంఐఎం మద్దతివ్వడంతో మేయర్, ఉప మేయర్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.