మేయర్‌,ఛైర్మన్ల ఎన్నిక…పరిశీలకులు వీరే

104
indrakaran
- Advertisement -

టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన రెండు మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్ డిప్యూటి మేయర్ల ను, ఐదు మున్సిపాలిటీలకు శుక్ర వారం జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు టిఆర్ఎస్ పార్టీ పరీశీలకులను నియమించింది .ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఎన్నికల పరిశీలకుల పేర్ల ను ప్రకటించారు .

• వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులు — మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ .

• ఖమ్మం కార్పోరేష కు పరిశీలకులు — మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి.

• కొత్తూరు మున్సిపాలిటీకి పరిశీలకులు — మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్

• నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకులు — టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు

• సిద్దిపేట మున్సిపాలిటీ పరిశీలకులు — రవీందర్ సింగ్ (మాజీమేయర్ కరీంనగర్ ), వంటేరు ప్రతాప్ రెడ్డి (ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్)

• అచ్చంపేట మున్సిపాలిటీ పరిశీలకులు — మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

• జడ్చర్ల — మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ చైర్మన్)

పరిశీలకులు గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల అబ్సర్వర్లు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని కెసిఆర్ ఆదేశించారు .కౌన్సిలర్లు ,కార్పొరేటర్లు ,ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పోరేషన్లకు మేయర్లును, డిప్యుటీ మేయర్లును ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు క్రమశిక్షణతో ఎన్నుకోనున్నారు.

- Advertisement -