మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

227
bonthu rammohan
- Advertisement -

తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54 వేలు దాటగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు.

తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా టెస్టు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో బొంతు రామ్మోహన్‌ హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

గతంలో బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్, టీ తాగిన హోటల్ యజమానికి కరోనా సోకడంతో మేయర్‌ రామ్మోహన్ రెండు సార్లు కొవిడ్‌-19 టెస్ట్ చేయించుకున్నారు. అప్పుడు నెగటివ్ రాగా ఇప్పుడు ఏ లక్షణాలు లేకపోయినప్పటికి నెగటివ్‌ వచ్చింది.

- Advertisement -