BirthDay:పంజాబీ సాహిత్యానికి వన్నె తెచ్చిన దలీప్‌ కౌర్

40
- Advertisement -

ఈ దేశంలోని సమాజంలో మరియు రాజకీయాల్లో పెరుగుతున్న సాంస్కృతిక అసహనం మరియు వాక్ స్వాతంత్ర్యం మరియు సృజనాత్మక స్వేచ్ఛకు ముప్పును నిరసిస్తూ మరియు ఇతర రచయితలకు సంఘీభావం తెలుపుతూ భారత నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని వెనక్కి ఇచ్చిన రచయితలలో ఒకరు దలీప్‌ కౌర్‌ తివానా. ఈమె తన అవార్డును 2015లో వదులుకున్నారు. దలీప్ కౌర్ తివానా 1935 లూథియానా జిల్లా రబ్బాన్లో జన్మించారు.

పంజాబీ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేసి పంజాబీలోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందింది. అలాగే పంజాబీ విశ్వవిద్యాలయంలో పంజాబీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. పంజాబీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను వేశారు. పంజాబీ యూనివర్సిటీలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలుగా నిలిచింది. తివానా 1971లో ఎహో హమారా జీవనా(ఇది మా జీవితం) అనే నవలకు గాను సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అంతేకాదు 1987లో రాష్ట్ర భాషల శాఖ శిరోమణి సాహిత్కర్‌ అవార్డుతో సత్కరించారు. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

Also Read: కర్ణాటక తొలి ముఖ్యమంత్రి.. కేసీ రెడ్డి

తివానా నవలల్లో అణగారిన అణిచివేయబడిన కోరికలు కలిగిన గ్రామీణ ప్రజలు మరియు స్త్రీ మనస్సు యొక్క అంతర్గత సంఘర్షణలే ఆమే ప్రధాన ఆంశం. ఆమె విశిష్ట సాహిత్య రచనలలో కొన్ని పీలే పట్టేయన్ ది దాస్తా, నంగే పైరన్ దా సఫర్, దుని సుహవా బాగ్, కథా కుకునస్ ది, లంబి ఉదారి, దూస్రీ సీత, ఓహ్ తాన్ పరి సి, మోహ్ మాయా ఉన్నాయి.

Also Read: అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం..

- Advertisement -