- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,995 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3.60 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 38,663 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Also Read:ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !
ఇక తిరుమలలో భక్తుల భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. హై లెవల్ సెక్యూరిటీతో భద్రత కల్పించాలని పెరిగిన రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
Also Read:ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం..
- Advertisement -