పసిడితో మెరిసిన మేరీకోమ్‌..

236
Mary Kom
- Advertisement -

భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ అద్భుతం చేసింది. అందరూ తన పనైపోయిందని అంటున్న తరుణాన ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో స్వర్ణం కొల్లగొట్టింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఆమె.. తన విభాగంలో కఠిన ప్రత్యర్థుల్ని ఓడిస్తూ పసిడి పతకం చేజిక్కించుకుంది. ఆదివారం 48 కేజీల విభాగం ఫైనల్లో మేరీ.. ఉక్రెయిన్‌ క్రీడాకారిణి హనా ఒఖోటాను 5-0తో మట్టికరిపించింది. రిఫరీలు ఏకగ్రీవంగా ఆమెను విజేతగా ప్రకటించారు.

Mary Kom

మేరీ వరుసగా ఐదు రౌండ్లలో 30-27, 29-28, 29-28, 30-27, 30-27తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన మేరీ.. ఫైనల్లో విజయం కోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయింది. 2, 3 రౌండ్లలో మాత్రమే ప్రత్యర్థి నుంచి ఆమెకు ప్రతిఘటన ఎదురైంది. మిగతా మూడు రౌండ్లలో ఆమెదే ఆధిపత్యం.

- Advertisement -