గిఫ్ట్ ఏ స్మైల్ స్పందించిన మర్రి రాజశేఖర్ రెడ్డి…

473
marri rajashekar reddy
- Advertisement -

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఒక అంబులెన్స్ ను ప్రభుత్వానికి సమకూర్చేందుకు ముందుకొచ్చారు .దీనికి సంబంధించిన మొత్తాన్ని టీ ఆర్ ఎస్ పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి వర్యులు కే టీ రామారావుకి చెక్ రూపం లో సోమవారం నాడు ప్రగతి భవన్ లో అందించారు.

కే టీ ఆర్ తన పుట్టిన రోజున స్వయంగా ఆరు అంబులెన్సులను సొంత నిధులతో ప్రభుత్వానికి సమకూర్చేందుకు ముందుకొచ్చి మాకు స్పూర్తి ఇచ్చారని ఈ నేపథ్యంలో తాను కూడా ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పిలుపునకు స్పందించి పార్టీ నేతలు దాదాపు వంద అంబులెన్సులను ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప పరిణామం అని మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపుతోంది అని పునరుద్ఘాటించారు. కేటీఆర్ స్పందించేగునం మరియు అయన ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావం తో చేసే కృషి మాకు అందరికీ ఆదర్శమని తెలిపారు.

- Advertisement -