రైతులకోసం పనిచేద్దాంః మంత్రి నిరంజన్ రెడ్డి

326
minister niranjan reddy
- Advertisement -

మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు రైతులకు చేరువై శాఖకు మంచి పేరు తీసుకురావాలి అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మార్కెటింగ్ శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింనందుకు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మార్కెట్ కు వచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. రైతుల సమస్యలను చిత్తశుద్దితో పరిష్కరించాలన్నారు. రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయరంగానికి చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకోవడం లేదన్నారు. రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కేంద్రానికి దిక్సూచిలా నిలుస్తున్నాయి. రైతుకు గిట్టుబాటుధర కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఈసందర్భంగా పదోన్నతులు పొందిన వారికి అభినందనలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

- Advertisement -