గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మణుగూరు సింగరేణి బృందం..

178
Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు హెచ్చెస్ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ ఏవిఎల్ఎన్ రావ్ మరియు మణుగూరు సింగరేణి బృందం మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చొరవ భావితరాలకు బంగారు బాట, దూరదృష్టితో బాధ్యాయుతంగా హరిత హారం చేపట్టి మొక్కలు నాటి వాటిని కాపాడే విధంగా చట్టం తీసుకురావడం అయన మొక్కలపై ఉన్న బాధ్యతకు అద్దం పడుతుంది అన్నారు.

దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్రమంతటా అవగాహాన కల్పిస్తుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇలాగే ముందుకు సాగాలని.. ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వారితో పాటు బి వెంకటేశ్వర్లు ఎస్ఓటు జీఎం, టివి రమణ, శ్రీ రమేష్, జనరల్ మేనేజర్లు, మణుగూరు సింగరేణి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -