Manish sisodia : సత్యాన్ని ఎప్పటికి ఓడించలేరు

3
- Advertisement -

ప్రపంచంలోని అన్ని శక్తులు ఏకతాటిపైకి వచ్చిన సత్యాన్ని ఓడించలేవు అన్నారు ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా. ఆప్ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనీశ్.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

డ్రగ్స్ మాఫియాపై విధించాల్సినటువంటి సెక్షన్లను నాపై, సంజయ్ సింగ్ పై విధించడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. జీవితకాలం జైలులో ఉంచాలని చూశారని కానీ అది సాధ్యం కాలేదన్నారు. బీజేపీకి ఓకే ఒక్క నైపుణ్యం ఉందని ఇతర పార్టీల్లోని నాయకులను విడగొట్టి, రకరకాల శిక్షలతో జైళ్లకు పంపించడం అన్నారు.

మాట వినని వారిపై మానసికంగా దాడి చేయడం అలవాటుగా మారిందన్నారు. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది ఆప్ కార్యకర్తలే కాదు..ప్రతి సామాన్యుడిది అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఒక్క రాష్ట్రంలో కూడా నిజాయితీగా పనులు జరుగుతున్నాయని నిరూపించుకోలేక పోయిందని ఎద్దేవా చేశారు.

Also Read:Hemant Soren: సోరెన్ చేయిపై ఖైదీ ముద్ర‌..

- Advertisement -