రాజమౌళి వల్లే ఇదంతా సాధ్యమైంది..!

74
- Advertisement -

లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనుండగా తొలిపార్టు సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్‌, త్రిష.. లాంటి స్టార్లతో పాటు ఎంతోమంది ప్రముఖులు నటించారు.

ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు మణిరత్నం ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా తీస్తున్నందుకు చిరంజీవితో సహా చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలపాలన్నారు.

ఇలాంటి పెద్ద పెద్ద కథల్ని ఎలా తీయాలో బాహుబలి తీసి చూపించి మా లాంటి దర్శకులకు ఓ దారి చూపించారు. నేను ఎప్పట్నుంచో ఈ సినిమా తెద్దామనుకున్నాను కానీ బాహుబలి రెండు పార్టులు రిలీజ్ చేసిన తర్వాత ఒకే కథని ఇలా రెండు పార్టులుగా అద్భుతంగా తెరకెక్కించొచ్చు అని రాజమౌళి తీసి చూపించారన్నారు.

- Advertisement -