- Advertisement -
గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర . ఛైర్మన్తో పాటు వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి,వల్లభనేని అనిల్ మరియు కొత్తగా గెలిచిన వార్డ్ మెంబెర్స్ అందరు కలసి మొక్కలునాటారు.
సమజాహితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. చిత్రపురి కాలనీ ఆవరణలో మొక్కలు నాటి సందర్భంగా మాట్లాడిన మణికొండ వైస్ చైర్మన్ నరేన్ద్రే రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పచ్చగా విల్లివిరియాలని అందరు ఈ కార్యక్రమాన్ని స్వీకరించి ముందుకు వెళ్లి ప్రకృతిని కాపాడాలని కోరారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామిని చేసిన కాదంబరి కిరణ్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్రపురి కమిటీ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -