క‌డియంను రాళ్ల‌తో కొట్టాలా?:మందకృష్ణ

23
- Advertisement -

గతంలో రాజినామా చేయకుండా పార్టీ లో చేరితే రాళ్ళతో కొట్టాలి అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నీ మాట ఏమైంది అన్నారు మందకృష్ణ మాదిగ‌. హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మంద‌కృష్ణ‌..మరి కడియం శ్రీహరి ని కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించింది ఎవరు….ఇప్పుడు ఎవరిని రాళ్ళతో కొట్టాలి.. నిన్ను రాళ్ళతో కొట్టాలా.. కడియం శ్రీహరి ని రాళ్ళతో కొట్టాలా… రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు, బిసి కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది..తీరని నష్టం చేసింది..కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా బలహీన వర్గాలను, మాదిగల సంఘాల ఐక్యం చేస్తాము..పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు..ఏమి మాట్లాడావు రేవంత్ రెడ్డి..ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అన్నారు.

కష్టం కాలంలో ఉన్న బిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కడియం శ్రీహరి ని ఏమని అన్నాలి..సిగ్గు లేని కడియం శ్రీహరి ని ఎలా పార్టీ లో కి తీసుకున్నావ్ రేవంత్ రెడ్డి..కడియం శ్రీహరి కి బిఆర్ఎస్ అన్ని పదవులతో న్యాయం చేసిందన్నారు.ఎమ్మెల్సీని చేసింది.. డిప్యూటీ సీఎం చేసింది.. ఇప్పుడు ఎమ్మెల్యే ను సైతం చేసింది..40 ఏళ్ళ రాజకియ జీవితంలో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయని వ్యక్తి కూతురికి వరంగల్ పార్లమెంట్ అభ్యర్దిగా నిలబెట్టారన్నారు.ఉద్యోగానికి రాజినామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరిన దొమ్మటి సాంబయ్యకు రేవంత్ అన్యాయం చేశారు..కడియం శ్రీహరి కూతురు ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంది..రేవంతు కావాలను కుంటే ఏపీలో సీటు ఇస్తే బాగుండేదన్నారు.

Also Read:ఉదయాన్నే ఈ ఆసనం తప్పక వేయండి!

- Advertisement -