టాలీవుడ్‌లో విభేదాలున్నాయి.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..

43
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ను మా ప్రెసిడెంట్‌ మంచు విష్ణు ఈరోజు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో విష్ణు భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ..’సీఎం జగన్‌తో సినిమా రంగం అంశాలపై మాట్లాడానని, ఏపీలో సినీ పరిశ్రమకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తాం. ఏసియాలోనే బెస్ట్‌ పిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇటీవల సీఎంతో సినీ ప్రముఖులకు జరిగిన భేటీకి నాన్న గారికి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని… అయితే, ఆ ఆహ్వానం నాన్నకు చేరకుండా కొందరు అడ్డుకున్నారని చెప్పారు. వాళ్లు ఎవరో తమకు తెలుసని, సమయం వచ్చినప్పుడు చెపుతామని అన్నారు. సీఎంతో భేటీకి మోహన్ బాబు వెళ్లకపోవడంతో ఆయనకు ఆహ్వానం అందలేదనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దీనిపై విష్ణు క్లారిటీ ఇచ్చారు.

కాగా,సినిమా టికెట్‌ల గురించి, ఇతర అంశాల గురించి ఫిల్మ్‌ ఛాంబర్‌లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నా సినిమా వాళ్లంతా ఒకే కుటుంబం. విభేదాలను అంతర్గతంగా పరిష్కరించుకుంటాం అన్నారు. సినిమా వాళ్లకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివి.అందరు తెలుగువాళ్లు మాకు కావాలి తెలిపారు.

- Advertisement -