మోదీతో మోహన్ బాబు భేటీ ..బీజేపీలో చేరిక?

449
modi Mohaan Babu
- Advertisement -

ప్రముఖ నటుడు, వైసిపి నేత మోహన్ బాబు ప్రధాన మంత్రిని కలిశారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన కుమార్తె మంచు లక్ష్మి, కుమారులు విష్ణు, మనోజ్లలతో కలిసి మోదీతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా ప్రధానితో మోహన్ బాబు భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈసందర్భంగా మోహన్ బాబు కుటుంబాన్ని మోదీ బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దీనికి మోహన్ బాబు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో బీజేపీ సీనియర్ నేతలను కూడా మోహన్ బాబు కలువనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Mohan Babu Family With Modi

బీజేపీ జాతియ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు తెలుస్తుంది. ఈవిషయాన్ని నటి మంచు లక్ష్మీ ట్వీట్టర్ ద్వారా తెలియజేసింది. ‘జస్ట్ ఇప్పుడే మన డైనమిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని కలిశాము’ అని మంచు లక్ష్మి తెలిపింది. కాగా 2019 ఎన్నికలకు ముందు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. మంచు విష్ణు భార్య విరోనికకు జగన్ చాలా దగ్గరి బంధువు అన్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ మోదీని కలవడంపై ఏపీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది.

- Advertisement -