ఆ నటీమణులు షాకింగ్ కామెంట్స్

26
- Advertisement -

పలువురు నటీమణులు తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. సెక్స్ సీన్లలో నటించడానికి ముందు డైరెక్టర్ నా పీరియడ్స్ గురించి అడిగేవారు అంటూ నటి అమృతా సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. లస్ట్ స్టోరీస్ 2లో నటించిన అమృతా సుభాష్ ఈ కామెంట్స్ చేయడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సేక్రెడ్ గేమ్స్ 2లో ఆమె ఓ రా ఏజెంట్ గా నటించారు. అయితే ఆ సిరీస్ లో సెక్స్ సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు అనురాగ్ తన పీరియడ్ డేట్స్ గురించి అడిగేవాడని అమృత చెప్పారు.

అలాగే తమిళ, మలయాళ సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఐశ్వర్య రాజేష్ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె ఎక్కవగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే చేస్తున్నారు. దీనిపై తాజాగా ఆమె మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు తమ సినిమాలలో పాత్రలు ఇవ్వట్లేదు.. అందుకే నా సినిమాల కు నేనే హీరోగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని తెలిపింది ఐశ్వర్య. అలాగే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read:పవన్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్ డేట్స్

మంచు లక్ష్మి మాట్లాడుతూ… “నేను హాలీవుడ్లో కొన్ని సినిమాలు చేశాను. అక్కడే ఉంటే ఈ పాటికి స్టార్ అయ్యేదాన్ని. కానీ ఫ్యామిలీ కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు. మధుశాలిని, బిందు మాధవి, నిహారిక, శివాని.. ఇలా చాలా మందికి ఛాన్సులు లేవు. ఆడియన్స్ కూడా బయటివారినే ఇష్టపడుతున్నారు” అని మంచు లక్ష్మి అన్నారు.

Also Read:కుసుమ జగదీష్ కుటుంబానికి కోటిన్నర సాయం..

- Advertisement -