మంచులక్ష్మిని బయపెట్టిన అనుష్క

27
- Advertisement -

మంచు లక్ష్మి… మోహన్‌ బాబు గారాల పట్టిగా తెలుగు ప్రేక్షకులకు ఎంత సుమరిచితమో… కాంట్రవర్సీ ట్రోల్స్‌ తో అంతే ఫేమస్‌ మంచు లక్ష్మి. నటిగా, యాంకర్‌ గాతనకంటూ గుర్తింపు సంపాదించుకున్న ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మంచు లక్ష్మికి ఇటు టాలీవుడ్‌ అటు కోలీవుడ్‌లో పలువురు సెలెబ్రిటీలు మంచి స్నేహితులు అని చెప్పొచ్చు.

గతంలో పలువురు సెలెబ్రిటీలతో టాక్‌ షో కూడా చేసింది మంచు లక్ష్మి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి టాలీవుడ్‌ సెలెబ్రిటీలపై పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తనకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తాప్సి మంచి స్నేహితులని, ఫోన్‌ చేసి రండే అంటే పరుగెత్తుకొస్తారని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. హీరోయిన్స్‌ కాకుండా పలువురు హీరోలు కూడా మంచు లక్ష్మికి స్నేహితులని పేర్కొంది. దగ్గుబాటి రానా తనకు మంచి మిత్రుడని.. తనకు నేనంటే చాలా ఇష్టమని తెలిపింది మంచు లక్ష్మి. దీంతో పాటు అనుష్క తనను టెన్షన్‌ పెట్టిన సంగతిని కూడా బయటపెట్టింది మంచు లక్ష్మి.

గతంలో ఓ షోలో పాల్గొనేందుకు అనుష్క శెట్టిని పిలిచానని.. తాను కూడా షోలో పాల్గొనేందుకు వస్తానని చెప్పిందని.. కానీ తీరా సమయానికి అనుష్క లిప్ట్ చేయలేదని దీంతో తాను టెన్షన్‌ పడ్డానని పేర్కొంది మంచు లక్ష్మి. ఆ సమయంలో అనుష్క భాగమతి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉందని.. అందుకే తన ఫోన్‌ ఎత్తలేదంటూ చెప్పుకొచ్చింది అనుష్క. రెండు రోజుల తర్వాత అనుష్కనే తనకు కాల్‌ చేసిందని… తను వస్తానని చెప్పానుగా అంటూ తనలో ఉన్న కంగారుని అనుష్క పోగోట్టిందని మంచు లక్ష్మి తెలిపింది.

ఇవి కూడా చదవండి 

ఐటమ్ సాంగ్స్ లో హాట్ బ్యూటీ

రవితేజ ఆ కోరిక తీర్చుకుంటాడట

ఆస్కార్ లిస్టులో తారక్ ?

- Advertisement -