సీఎం కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు హీరో మంచు విష్ణు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై సినిమా వాళ్లు స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్పందించిన విష్ణు సినిమా వాళ్లు కేసీఆర్కు భయపడుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.ఇంటర్ ఫలితాల గందరగోళం విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నింధించడం మాని అసలు ఈ తప్పిదాలు జరగడానికి గల కారణాలు గుర్తించాలని సలహా ఇచ్చారు.
తప్పిదాల కారణంగా 20 మంది తమ్ముళ్లు, చెల్లెళ్లను మనం కోల్పోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దామని ట్వీట్ చేశారు. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం…. కేటీఆర్ చాలా చురుకైన, విద్యార్థుల కోసం పనిచేసే రాజకీయ నాయకుడని కితాబిచ్చారు. కేసీఆర్ ఫైర్బ్రాండ్ అని అందరికీ తెలుసు అంతేగానీ ఆయన ఆయన డిక్టేటర్ కాదన్నారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నింధించడానికి బదులు, అసలు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో గుర్తించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. దీని వల్ల భవిష్యత్తులో ఇలాంటి ఘోరమైన తప్పిదాలు మళ్లీ జరగకుండా నిరోధించొచ్చు అని పేర్కొన్నారు. విద్యార్థులెవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సినీ,రాజకీయ,మానసిక నిపుణులు సైతం విద్యార్థులకు సూచిస్తూ అండగా నిలబడుతున్నారు.
Some factions are also stating that the film fraternity are “scared” of Mr. KCR and I’d like to say that these people have a great imagination. There is no truth to this. My concern lies primarily in finding the reasons first so we can prevent such an atrocity in the future.
— Vishnu Manchu (@iVishnuManchu) April 26, 2019
We live in a democracy, and as far as I know @KTRTRS is a very proactive and pro student politician & yes Mr. KCR is known to be a firebrand but for a reason and he isn’t a dictator. So instead of blaming the T Govt, I would stress on concentrating first to know the real cause.
— Vishnu Manchu (@iVishnuManchu) April 26, 2019