మంగళవారం నుండి ‘మనం’..

248
- Advertisement -

బుల్లితెర దర్శకుడు అనిల్‌ కడియాల దర్శకత్వంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రవీణ కడియాల నిర్మాణ బాధ్యతలతో రూపొందుతున్న గేమ్ షో ‘మనం’ సెలబ్రేషన్‌ ఆఫ్‌ లైఫ్‌ అనేది ఉపశీర్శిక. ఎన్నో చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ నటుడు సాయికుమార్‌. హీరోగా, విలన్‌గా,ప్రత్యేక పాత్రల ద్వారా ఎంతో పేరు ప్రఖ్యతలు సంపాదించుకున్న సాయికుమార్‌ గతంలోను బుల్లితెరపై కూడా సత్తా చాటారు. బుల్లితెరపై సాయికుమార్‌ యాంకర్‌గా చేసిని ‘వావ్‌’ అనే గేమ్‌ షో 250 ఎపిసోడ్లు ఈ టీవీలో ప్రసారం అయ్యింది. నంది అవార్డు కూడా గెలుచుకుంది. సాయికుమార్‌ కూడా ఉత్తమ వ్యాఖ్యతగా అదే కార్యక్రమానికి బుల్లితెర నందిని అందుకోవడం విశేషం.

Manam Game Show Soon

దర్శకుడు అనిల్‌ కడియాల దర్శకత్వంలోనే ఈ వావ్‌ రూపొందింది. మళ్లి 7 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కలయికలో ‘మనం’ అనే ఒక ఫ్యామిలీ గేమ్‌ షో ద్వారా మన ముందుకు వస్తున్నారు. ఏ గేమ్‌ షో అయినా సెలబ్రిటీస్‌తో ముడిపడి ఉంటుంది. ఈ ‘మనం’ అనే షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కామన్‌ పీపుల్‌ ఎంటర్‌ అవుతున్నారు. ఈరోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లందరూ ఓ చోట కూర్చుని టైమ్‌ స్పెండ్‌ చేయడం గగనమైపోయింది. అది పరిస్థితుల వల్ల కావచ్చు. సమయం లేక కావచ్చు. అందుకే ఆ సమయాన్ని సద్వినియోగం చేయడానికి, రెండు కుటుంబాలు ఒక చోట చేరితే అది పండగలా మారుతుంది అని చూపించడానికి..చేసే ప్రయత్నమే మా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వస్తున్న మనం అని తెలిపారు నిర్మాత ప్రవీణ కడియాల.

Manam Game Show Soon

సాయికుమార్‌ మాట్లాడుతూ..ఈ నెల 27 నుండి..ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రైమ్‌టైమ్‌లో ఈ టీవీలో ఈ షో ప్రసారం కాబోతుంది. ప్రేక్షకులు ఆశీర్వదించి కార్యక్రమాన్ని విశేషంగా ఆదరించాలని కోరుతున్నాము. ఈ ఫ్యామిలీ గేమ్‌ షోలో కుటుంబ అనుబంధాలు,అప్యాయతల గురించి మాట్లాడుకుంటూ, ఆట పాటలతో ఎంజయ్ చేస్తూ లక్షల విలువైన బహుమతులు గెలుచుకుంటూ అందరిని ఎంటర్‌టైన్‌ చేయటమే ఈ మనం ప్రత్యేకత అని అన్నారు.

- Advertisement -