ఆల్కహాల్ తీసుకున్న శ్రీదేవి..ప్రమాదవశాత్తు మృతి..!

258
sridevi
- Advertisement -

ప్రముఖ సినీ తార శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయింది. అప్పటికే శ్రీదేవి బంధువు సౌరభ్‌ మల్హోత్ర భారతీయ కాన్సులేట్‌ కార్యాలయానికి వెళ్లి భౌతిక కాయాన్ని తీసుకెళ్లే అనుమతుల గురించి వాకబు చేశారు.

అయితే మరణదృవీకరణ పత్రంలో ఆసక్తికర విషయాలు వెల్లవయ్యాయి. ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు ఆమె బాత్ టబ్‌లోని నీళ్లలో చనిపోయిందని డెత్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు. మరి కాసేపట్లో కుటుంబ సభ్యుల చేతికి శ్రీదేవి మృతదేహం ఇచ్చే అవకాశం ఉంది.

ప్రత్యేక విమానంలో ఆమె భౌతికకాయం ముంబయికి బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులర్పించేందుకు ముంబయి చేరుకున్నారు.

- Advertisement -