భవానీపూర్‌ ఉప ఎన్నిక.. మమతా బెనర్జీ ముందంజ..

78
mamatha
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రారంభమైంది. కొన్ని నెల‌ల క్రితం పశ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. సీఎంగా ఆమె కొన‌సాగాలంటే ఎమ్మెల్యేగా గెల‌వాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో భవానీపూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేశారు. ఇక్కడి నుంచి మమత ప్రత్యర్ధిగా బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేస్తున్నారు.

ఈ రోజు జ‌రుగుతోన్న ఓట్ల లెక్కింపులో దీదీ ముందంజ‌లో దూసుకుపోతున్నారు. ఆమె క‌న్నా బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ 2,800 ఓట్లు వెన‌క‌బ‌డి ఉన్నారు. మ‌రోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని మరో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. జంగీపుర్‌, సంషేర్‌గంజ్‌ స్థానాల్లోనూ టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సీఎం ప‌ద‌విని కాపాడుకోవడానికి భవానీపూర్‌ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ విజయం సాధించడం తప్పనిసరి కావ‌డంతో ఈ ఎన్నిక‌ను ఆమె ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు.

- Advertisement -