ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ..

310
mallareddy
- Advertisement -

ముస్లిం సోదరలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గం తుంకుంటా మునిసిపల్ పరిధిలోని సింగయపల్లి లో రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులకు బియ్యం మరియు నిత్యవసర సరుకులను పంపిణి చేశారు.

లాక్ డౌన్ సందర్భంగా పేద మధ్య తరగతి ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంలో రంజాన్ పండగ రావడం బాధకరమన్నారు. ముస్లింలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా రంజాన్‌ను ఘనంగా జరుపుకునే విధంగా బియ్యం పండ్లు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించామని చెప్పారు.

ఈ సారి రంజాన్‌ను అంతా ఇంటిలోనే జరుపుకోవాలని….ఇంకా కొన్ని రోజుల పాటు మనం స్వీయా నియంత్రణ లో ఉండి, కరోనా ను తరిమేయాలన్నారుజ ఈ కార్యక్రమ దాతలకు ధన్యవాదాలు తెలిపారు మల్లారెడ్డి. ఈ కార్యక్రమం లో తుంకుంటా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -