మ‌ల్క‌పేట పంప్ హౌస్ ట్ర‌య‌ల్ ర‌న్ స‌క్సెస్..

66
- Advertisement -

సిరిసిల్ల జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు గోదావరి నీటిని అందించి ఎండిపోయిన భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం మల్కపేట రిజర్వాయర్‌ ప్రాజెక్టును చేపట్టింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్యాకేజీ-9 కింద నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ ద్వారా సిరిసల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 96,150 ఎకరాలకు నీందరనుంది.

ఈ మేరకు ఇవాళ నిర్వహించిన మల్కపేట పంప్‌ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్యాకేజీ – 9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకుంది ఈ పంప్ హౌస్. 3 టీఎంసీ ల సామర్థ్యం గల మల్కపేట రిజ‌ర్వాయ‌ర్ పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది.

Also Read:Rajinikanth:మంచి మిత్రుడిని కోల్పోయా

130 మీటర్ల లోతు నుండి 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు పంప్ హౌస్‌లో 30 మెగావాట్ల చొప్పున రెండు మోటార్లు అమర్చారు. సర్జ్ పూల్ పంప్ హౌస్ ద్వారా నీటిని రిజర్వాయర్‌లోకి పంప్ చేస్తారు. గ్రావిటీ కాలువల ద్వారా గంభీరావుపేట మండలం సింగసముద్రం ట్యాంకు, బత్తల చెరువుకు గోదావరని నీటిని తరలిస్తారు. అనతరం మరో కాలు ద్వారా ఎగువ మానేరు జలాశయానికి నీటిని తరలిస్తారు.మోటార్లు ఆపరేట్ చేయడానికి 33/11కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు
చేయబడింది.

Also Read:హ్యాపీ బర్త్ డే..చంద్రమోహన్

- Advertisement -