యాదాద్రికి మాక్ గ్రూప్ విరాళం..

143
yadadri
- Advertisement -

యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణంలో భాగంగా భాగస్వాములయ్యేందుకు విరాళాలతో తమవంతుగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన పిలుపునందుకుని పలువురు గొప్పగా స్పందిస్తున్నారు.

యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి పుణ్యక్షేత్రానికి తమ వంతుగా ఒక్క కిలో బంగారాన్ని సమర్పించినట్టు ‘మాక్ (MAK) గ్రూప్ సంస్థ చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి ప్రకటించారు. చారిత్రాత్మక, అద్భుతమైన పవిత్ర యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణంలో తమ వంతుగా బంగారం సమర్పించుకోవడం తమకు ఎంతో ఆనందంగా వుందని, అది తమకు దక్కిన గొప్ప ప్రాధాన్యతగా భావిస్తున్నట్టు మురళీకృష్ణా రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

- Advertisement -