ముఖేశ్ గౌడ్ తో మైనంప‌ల్లి భేటీ..

284
mukesh goud, mainam pally
- Advertisement -

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆయ‌న కుమారుడు విక్ర‌మ్ గౌడ్ తో భేటీ అయ్యారు టీఆర్ఎస్ పార్టీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు. నేడు ముఖేష్ గౌడ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌కు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు మైనంప‌ల్లి. వీరిద్ద‌రి భేటీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. గ‌త కొద్ది రోజుల‌గా ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌టంతో ఈ భేటీ ప్రాధ‌న్య‌త‌ను సంత‌రించుకుంది.

mukesh goud, mainampally

ఉద‌యం మీడియాతో మాట్లాడిన ముఖేశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాలున్నాయ‌నేది వాస్త‌వేమ‌న‌ని తెలిపారు. పార్టీ మారే అంశంపై ముఖేశ్ గౌడ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే త‌న అనుచ‌రులు, కార్యక‌ర్త‌ల‌తో స‌మావేశం అయ్యి త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారు. గ‌త కొద్ది రోజుల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. హైద‌రాబాద్ లోని గోషామ‌హాల్ నుంచి ముఖేశ్ ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా..2014 ఎన్నికల్లో బిజెపి అభ్య‌ర్ధి చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

- Advertisement -