మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై అపూర్వ స్పందన…

32
- Advertisement -

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. ఆకాశంలో సగం ఆవనిలో సగం అవకాశంలో సగమని మహిళలకు సమానమైన స్థానం ఉండాలని మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో దేశంలోని వివిధ 13 పార్టీలు మరియు ఆయా సంఘాల నేతలు హాజరయ్యి మద్ధతు తెలిపారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ….ఓటు వేయడంలో రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కు కల్పించినప్పుడు… చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించదని ప్రశ్నించారు. ఈ అంశంపై చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రభుత్వాలను మరింతగా డిమాండ్ చేయాలని సూచించారు.

డీఏంకే ఎంపీ తమిళ్ సై తంగపంద్యాన్ మాట్లాడుతూ… వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చడానికి కవిత చేసే పోరాటంలో తాము కలిసి నడుస్తామని అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ద మాట్లాడుతూ…. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత లేవనెత్తిన డిమాండ్ కు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, దాన్ని సంస్కరణలు తీసుకురావడం కోసంతో పాటు ప్రజలకు మంచి చేసే బిల్లులను తీసుకురావడానికి ఉపయోగించాలని సూచించారు.

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ… రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తమని ప్రకటించారు. అయితే, రిజర్వేషన్ లో రిజర్వేషన్ కోటా ఉండాలి అని ప్రతిపాదించారు. పార్లమెంటుతో పాటు బయటా లేవనెత్తాల్సిన అంశాలపై మోహన్ ఉండాలని అన్నారు. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతంగా నిర్మించాల్సిన అవసరం తెలిపారు.

సీపీఐ ఎంపీ బినాయ్ బిశ్వం మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లు కు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొచ్చాయని విమర్శించారు. 21వ దశాబ్దంలో కూడా మహిళా హక్కులను సరికాదని సూచించారు. కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఈ ఉద్యమంలో తాము భాగస్వాములు అవుతామని ప్రకటించారు.

ఆర్ఎల్డీ పార్టీ మహిళా విభాగం ప్రతిభా సింగ్, ఆ పార్టీ నేత భూపేంద్ర చౌదరి మాట్లాడుతూ…. రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనీ తెలిపారు. ముఖ్యంగా బిల్లుపై జరుగుతున్న చర్చల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన లేదని చెప్పారు.

జేఎంఎం ఎంపీ మౌహ మాఝి మాట్లాడుతూ…. ఒకవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం మంచిది కాదని అన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ బిల్లు రావాల్సిందే, కవిత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు.

సమాజ్‌ వాది పార్టీ ఎంపీ ఎస్టీ హాసన్ మాట్లాడుతూ…మహిళలకు తగిన వాట కల్పించకుండా, గౌరవం ఇవ్వకుండా ఏ దేశం కూడా సూపర్ పవర్ కాబోదని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి కావాలంటే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి అని అన్నారు.

వీసీకే ఎంపీ తిరుమావలవన్ మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అవసరమని తెలిపారు. ఆలస్యం చేస్తే దేశానికి , ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి…

ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాం..

మహిళా రిజర్వేషన్‌ బిల్లు..రౌండ్ టేబుల్ మీట్

తెలంగాణ ప్రజలు వలస పోవాలా? హరీశ్‌

- Advertisement -